వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సర్పంచుల సంగం నాయకులు రాజిరెడ్డి మాట్లాడుతూ ఈ మధ్య కాలం లోని సర్పంచులు తొంబై శాతం ప్రతి పక్ష బీఆరెస్ పార్టీ అనుకూల సర్పంచులే ఉంటారని ప్రభుత్వ పాలకులు సర్పంచులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదని సర్పంచుల సంగం నాయకులు కె రాజిరెడ్డి పేర్కొన్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు మాజీ సర్పంచు లు బిల్లుల చెల్లింపుల కోసం.
అసెంబ్లీ కి వెలుతారన్న సమాచారం మేరకు దోమ పోలీసులు బుధవారం దోమ మండల కేంద్ర సర్పంచ్ కె రాజిరెడ్డి ఇంటికి వెళ్లి హౌస్ అరెస్ట్ చేసి ఎక్కడ వెళ్ళవద్దని జిల్లా పోలీసు అధికారుల ఆదేశాలను రాజిరెడ్డి కి వివరించారు ఈ సందర్బంగా రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిరంకుశ వైఖరి పై మండి పడ్డారు పోలీసులతో నీరసనలను అనుగదొక్కిన పార్టీలు ఏమయ్యోయో గుర్తు చేస్తూ మాజీ సర్పంచులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యేనమిది వందల కోట్లకు పైగా చెల్లించాలని ప్రభుత్వమే లెక్కలు చెప్పి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మాజీ సర్పంచు లను ఇబ్బందుల పాలు చేస్తున్న ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాధించదని అన్నారు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇరవై కోట్లకు పైగా బిల్లులు రావాల్సిన విషయం గుర్తు చేస్తూ ప్రభుత్వ పెద్దలు అప్పుల పాలు అయిన మాజీ సర్పంచ్ లను ఆడుకోవాలని రాజిరెడ్డి కోరారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


