TRINETHRAM NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం లోని శ్రీ కట్ట మైసమ్మ తల్లి జాతర సందర్భంగా అమ్మవారిని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఈరోజు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జీ.సురేష్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రాఘవరెడ్డి, గణేష్, వారాల వినోద్, ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.