Cricket Tournament : క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన శ్రీను బాబు

TRINETHRAM NEWS

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన శ్రీను బాబు

రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగిరి మండలంలోని రాణి రుద్రమదేవి స్టేడియంలో రామగిరి మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అజాతశత్రువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభావతి శ్రీపాద రావు స్మారకార్థం నిర్వహించిన మంథని డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కు హాజరై టాస్ వేసి క్రీడాకారులను పరిచయం చేసుకొని మ్యాచ్ ను ప్రారంభించి విజేతలకు బహుమతులు అందజేసిన దుద్దిల్ల శ్రీను బాబు

ముందుగా సెంటనరీ కాలని లో పొలిటికల్ జట్టు వర్సెస్ రామగిరి ప్రెస్ జట్టు క్రికెట్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిన శ్రీను బాబు కీపింగ్,బ్యాటింగ్ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపిన శ్రీను బాబు యువత చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ కన్నవారికి పుట్టిన గ్రామానికి మంచి పేరు తీసుకరావాలని శ్రీను బాబు అన్నారు. సెంటనరి కాలనీ లో శ్రీపాదకప్ క్రికెట్ పోటీల ముగింపు ఫైనల్ మ్యాచ్ ను తిలకించి విజేతలకు బహుమతులు అందించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top