వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ .రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా వికారాబాద్ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త తస్వర్ అలీ ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ముస్లిం సోదరులకు ఖర్జూర తినిపించి ఈరోజు ఉపవాస దీక్షను విరమింపచేసారు.
స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ముస్లింలు ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


