జూన్ 26, 2026
TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ ఇందిరమ్మ కాలనీ, పీకే రామయ్యా కాలని,ఆటో కాలనిలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ మంచినీళ్లు అందియాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేగా గెలిచిన 15 రోజులకే.మొట్ట మొదటిగా అభివృద్ధి కాకుండా ఉన్నా రెండోవ డివిజన్ ను ఎంచుకొని 40 లక్షల రూపాయల నిధులు కేటాయించి ఇందిరమ్మ కాలని లో మిషిన్ భగీరథ పైప్ లైన్ కోసం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే అందులో భాగంగా ఎమ్మెల్యే ఆదేశాలతో రెండోవ డివిజన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ దగ్గర ఉండి ప్రజలకు మంచి ఇల్లు అందించాలని ప్రతి ఇంటికి మంచినీటి నల్లా కనెక్షన్ ఇప్పించి మంగళవారం రోజునలబ్ధిదారులకు కనెక్షన్ కు సంబంధించిన పాస్ బుక్ ను అందజేయడం జరిగిందని మల్లేష్ తెలిపారు ఎమ్మెల్యే రెండోవ డివిజన్ ను అభివృద్ధి పథంలో ముందు నడిపిస్తున్నందుకు మా రెండవ డివిజన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మడిపెల్లి మల్లేష్ అన్నారు ఈ కార్యక్రమంలో.కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రాల మల్లేష్, నాగరాజు, హన్మంత్, మధు,ఈశ్వరమ్మ, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Madipelli Mallesh

You cannot copy content of this page