జూన్ 26, 2026
TRINETHRAM NEWS

అధ్యక్షులు నెలకంటి రాము

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆర్ సి ఎల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు నేలకంటి రాము ఆధ్వర్యంలో కార్మికుల తో కలిసి రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ను కలసి ఆర్ ఎఫ్ సి ఎల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఆర్ ఎఫ్ సి ఎల్ కాంట్రాక్టు కార్మికులకు అండగా ఉంటానని మీ సంస్థలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని మరియు ఢిల్లీలో ఉన్న ఆర్ ఎఫ్ సి ఎల్ కార్యాలయానికి వెళ్లి అధికారులతో మాట్లాడి మీ సమస్యలను పరిష్కరిస్తానని కార్మికులకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిట్టబోయిన రాజ్ కుమార్, మాజీ కార్పొరేటర్ కందుల సతీష్ హోటల్ శంకర్ మల్లేష్ రమేష్ రెడ్డి ఎరుకల అంజి,దాత శ్రీనివాస్, దూస రాజేష్, జనగామ శ్రీనాథ్, సొల్లు కుమార్, శ్రీనివాస్, తరుణ్, మరి కుమారస్వామి, శ్రీనివాస్ ఆనంద్, జస్వంత్, బిక్షపతి,ఫిరోజ్ తదితరులు అని విభాగం నుండి అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

RFCL contact labor

You cannot copy content of this page