WhatsApp Image 2024 02 01 at 6.36.25 PM
Trinethram News : స్థానిక ఎన్జీ హోమ్ లో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ నందు 35 సంవత్సరములు సేవలు అందించిన పెట్లూరి హనుమంతరావు బాపట్ల శాఖ అధికారిగా పదవీ విరమణ సందర్భంగా ఆ బ్యాంకు రీజినల్ మేనేజర్ వీరారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన బాపట్ల ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. పలువురు ప్రముఖ ఖాతాదారులు ఆయన సేవలు పొందడం అదృష్టమని, డ్వాక్రా మహిళలకు అందించిన సేవలు గురించి, ముఖ్యంగా పొదుపు ఖాతాల గురించి అందించిన విశేష అవగాహన అని ర్వచనీయమని ప్రశంసించారు. ఈ సన్మాన కార్యక్రమంలో యూనియన్ లీడర్ బోడ శ్రీనివాసరావు, అధికారులైన ఆంజనేయులు, సుభాష్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
