జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 04 at 8.49.19 AM

TRINETHRAM NEWS

Trinethram News : టెన్త్ క్లాస్ టాలెంట్ టెస్ట్ పోస్టర్ని రిలీజ్ చేసిన కరణం వెంకటేష్ చీరాల నియోజకవర్గ ఇన్చార్జ్ స్థానిక చీరాలలోని రామకృష్ణాపురంలో క్యాంప్ ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ మరియు విద్యార్థి జేఏసీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు దుడ్డు మార్క్ రత్నరాజు కరుణాకర్ కృష్ణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కరణం వెంకటేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి 15 నిర్వహించే టెన్త్ క్లాస్ టాలెంట్ టెస్ట్ పరీక్ష ప్రతి ఒక్క విద్యార్థి ప్రతిభను చూపించాలని పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ప్రతిభా పరీక్ష ద్వారా మొదటి నుంచి పది ర్యాంకులు సాధించిన విద్యార్థులకు విలువైన బహుమతులు ఇవ్వబడతాయని టెన్త్ క్లాస్ పరీక్షల్లో భయాన్ని పోగొట్టాలని ప్రతిభా పరీక్ష ఉపయోగపడుతుందని మరియు స్కాలర్షిప్లు కూడా విద్యార్థి జేఏసీ వాళ్లు అందించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో రాయపాటి జగదీష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఒకటి నుంచి పది ర్యాంకులు సాధించిన విద్యార్థినికి స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుందని పదవ తరగతి పరీక్షల్లో భయాన్ని పోగొట్టి విద్యార్థులు పరీక్ష బాగా రాసి మంచి ర్యాంకులు సాధించాలని అన్నారు బాపట్ల జిల్లా అధ్యక్షుడు దుడ్డు మార్కు మాట్లాడుతూ ప్రతి ఒక్క పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులు అందరూ కూడా ఈ పరీక్ష రాయాలని కోరారు.

You cannot copy content of this page