జూన్ 27, 2026

IMG 20241125 WA0047

TRINETHRAM NEWS

జిల్లాలోని 1007 పాఠశాలలకు ఫెసిలిటేషన్ గ్రాంట్స్ విడుదల

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
వికారాబాద్ జిల్లాలోఉన్నటువంటి 1007 ప్రభుత్వ, స్థానిక సంస్థ మరియు ఆదర్శ పాఠశాలల పారిశుధ్య కార్యక్రమాల నిమిత్తమై తెలంగాణప్రభుత్వఆదేశానుసారం మూడునెలలకుగానురూ.1,68,93,000/- నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ నిధులను పైన పేర్కొన్న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఖాతాల్లో జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. దీని ద్వారా పాఠశాలల్లోని పరిసర ప్రాంతాలు మరియు మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉండాల్సిన బాధ్యత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పైన ఉంటుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page