డిండి( గుండ్ల పల్లి) జనవరి 31 త్రినేత్రం న్యూస్. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సర్పంచ్ నల్లగంతుల రవి అన్నారు. శనివారం డిండి మండల కేంద్ర ప్రైమరీ స్కూల్ ను సర్పంచ్,ఎంఈఓ తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. విద్యార్థులు చదువు,ఆటల్లో రాణించాలని అన్నారు. కాలానికి అనుగుణంగా విద్యార్థులు ముందుండాలని అన్నారు. అనంతరం స్కూలు ఉపాధ్యాయులకు ఎంఈఓ కుర్చీలను అందించడం జరిగింది.
సాయంత్రం ట్యూషన్ వుండే విద్యార్థులకు సర్పంచ్ స్నాక్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు రామారావు , ఉపాధ్యాయులు బుజ్జి రాణి, షహీన్,తరుణ్, సందీప్,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


