తేదీ : 12/10/2025. అనకాపల్లి జిల్లా : (త్రినేత్రం న్యూస్); నక్కపల్లిలో మత్స్యకారులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా నెల రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో విశాఖ మరియు విజయవాడ రోడ్డు మార్గంలో పన్నెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తమ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళనను విరమించేదే లేదని మత్స్యకారులు స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


