WhatsApp Image 2024 03 18 at 10.18.47
Trinethram News : తెలంగాణ ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ నేడు జగిత్యాలలో జరగనున్న విజయ సంకల్ప సభకు హాజరు కానున్నారు. జగిత్యాలలోని గీతా విద్యా లయ గ్రౌండ్లో ఈ సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్త య్యాయి.
ఉదయం 11.15 గంటలకు జగిత్యాలకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సభలో మోడీ పాల్గొననున్నారు.
సభ అనంతరం హైదరా బాద్ చేరుకుని మోడీ ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ సభ సందర్భంగా బందోబస్తుకు 1600 మందిని పోలీసులు మోహరించారు..
