ప్రాణ ప్రతిష్టకు 7 రోజుల ముందు నుంచే పూజలు.. రామయ్య కళ్లకు కాటుక దిద్దనున్న ప్రధాని మోడీ

TRINETHRAM NEWS

Ayodhya: ప్రాణ ప్రతిష్టకు 7 రోజుల ముందు నుంచే పూజలు.. రామయ్య కళ్లకు కాటుక దిద్దనున్న ప్రధాని మోడీ…

జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా పవిత్రోత్సవం జరగనుంది.. అయితే ప్రాణ ప్రతిష్ట ముహార్తానికి ఏడు రోజుల ముందు పూజలు అంటే జనవరి 15న ప్రారంభమవుతాయి. ప్రాణ ప్రతిష్ట పూజతో పాటు స్వామివారికి బంగారు వస్త్రాలను సమర్పించి ధరింపజేయనున్నారు. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రధాని మోడీ తో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యాగీ ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంద్ బెన్ పటేల్ కూడా గర్భగుడిలో హాజరుకానున్నారు. దీంతో పాటు సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.

రామ జన్మ భూమి అయోధ్య సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న జయజయధ్వానాలు మిన్నంటుతున్నాయి. తోరణాలు నిర్మించి పూలవర్షం కురిపించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. గత 500 ఏళ్ల క్రితం నుంచి ఉన్న నిరీక్షణకు మరికొన్ని రోజుల్లో తెరపడుతోంది. బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవంతో రామభక్తుల నిరీక్షణ జనవరి 22న ముగుస్తుంది. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రధాని మోడీ స్వయంగా రామ్ లల్లా విగ్రహానికి కర్టెన్ తొలగించి, రామయ్యని పూజిస్తారు.

జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా పవిత్రోత్సవం జరగనుంది.. అయితే ప్రాణ ప్రతిష్ట ముహార్తానికి ఏడు రోజుల ముందు పూజలు అంటే జనవరి 15న ప్రారంభమవుతాయి. ప్రాణ ప్రతిష్ట పూజతో పాటు స్వామివారికి బంగారు వస్త్రాలను సమర్పించి ధరింపజేయనున్నారు. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రధాని మోడీ తో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యాగీ ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంద్ బెన్ పటేల్ కూడా గర్భగుడిలో హాజరుకానున్నారు. దీంతో పాటు సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. రామ జన్మభూమి ప్రధాన వాస్తుశిల్పి ఆచార్య సత్యేంద్ర దాస్ పూజలు నిర్వహించనున్నారు.

You cannot copy content of this page

Scroll to Top