WhatsApp Image 2024 04 12 at 14.10.38
Trinethram News : Apr 12, 2024,
అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై పోలీసుల దాడి
భూపాలపల్లి, కాటారం, మహాదేవ్ పూర్ లో పలు అక్రమ వడ్డీ, వ్యాపారుల ఇల్లు, కార్యాలయాలపై భూపాలపల్లి, కాటారం డిఎస్పీల ఆధ్వర్యంలో 12 బృందాలతో పోలీసులు దాడులు నిర్వహించారు. 193 ప్రామిసరీ నోట్లు, 93 ఏటీఎం కార్డులు, 61 ఖాళీ చెక్కులు, 28 బ్యాంకు పాసు బుక్కులు, 109 బ్యాంకు చెక్కులు, 13 బాండ్ పేపర్లు, 11 పట్టా పాస్ బుక్కులు, రూ. 3, 71 240 స్వాధీనం చేసుకొని, గురువారం 12 మందిపై కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
