ఏలూరు జిల్లా : ఫిబ్రవరి : ఎనిమిది: (త్రినేత్రం న్యూస్); ఈ నెల అనగా ఫిబ్రవరి తొమ్మిది వ తారీకున అంటే సోమవారం నాడు నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉదయం పది గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ వినూత్న తెలిపారు.
డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలపై ఆర్జీలు అందజేయవచ్చని సూచించారు. ప్రతి దరఖాస్తును ఆన్లైన్ చేసి, నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా క్లినిక్ లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

