WhatsApp Image 2025 01 13 at 6.39.58 PM
మంత్రి పొంగులేటి మీద తిరగబడ్డ ఖమ్మం ప్రజలు
Trinethram News : ఖమ్మం : కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసం పై జనం తిరుగుబాటు
అర్హులకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు ఇచ్చారని ఆరోపణ
నచ్చచెప్పినా వినిపించుకోకుండా మంత్రితో వాగ్వాదానికి దిగిన గిరిజన మహిళలు. సహనం కోల్పోయి గిరిజనులు, స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పొంగులేటి
కవరేజ్ కోసం వచ్చిన మీడియాను వీడియోలు తీయకుండా బెదిరించిన పోలీసులు
మొన్న ఆచార్లగూడెం, నేడు దుబ్బ తండా
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో కాంగ్రెస్ నేతల మోసంపై మంత్రిని నిలదీసిన గిరిజనులు
భోగి రోజున బోగస్ పంపకాలు
మంత్రి పొంగులేటికి ఎదురు తిరిగిన డబల్ బెడ్ రూమ్ గిరిజన లబ్ధిదారులు
గతంలో అర్హులుగా గుర్తించిన లిస్టును తారుమారు చేసిన స్థానిక కాంగ్రెస్ నాయకులు
మంత్రిని చుట్టుముట్టి కదలకుండా నిలదీసి ప్రశ్నించిన లంబాడ మహిళలు
కూసుమంచి మండలం దుబ్బుతండాలో కాంగ్రెస్ లోకల్ నాయకులు నిర్వాకం
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని దుబ్బ తండా గ్రామంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబ్బల్ బెడ్ రూం ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా మార్చిన మంత్రి పొంగులేటి
అర్హలకు కాకుండా కాంగ్రెస్ నాయకుల చెప్పిన కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని నిరసన చేపట్టిన గిరిజనులు
ఇళ్ల ప్రారంభానికి వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నిరసన సెగ
ప్రారంభం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడకుండానే వెళ్లిపోయిన పొంగులేటి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
