గడువులోగా ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయని వారిని నుంచి రూ.600 కోట్లకుపైగా పెనాల్టీ ఛార్జీలు

TRINETHRAM NEWS

గడువులోగా తమ పాన్‌ను ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయని డిఫాల్టర్‌ల నుంచి రూ.600 కోట్లకు పైగా పెనాల్టీని వసూలు చేసింది కేంద్ర ప్రభుత్వం.

ఇప్పటి వరకు 11.48 కోట్ల పాన్‌కార్డులు ఆధార్‌తో అనుసంధానం కాలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చింది.

జనవరి 29, 2024 నాటికి ఆధార్‌తో లింక్ చేయని పాన్‌ల సంఖ్య 11.48 కోట్లు అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయని వ్యక్తుల నుండి జూలై 1, 2023 నుండి జనవరి 31, 2024 వరకు రుసుము రూ.601.97 కోట్లు వసూలు చేసినట్లు చౌదరి చెప్పారు. పాన్, ఆధార్ లింక్ చేయడానికి చివరి తేదీ జూన్ 30, 2023.

ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. గడువులోపు పన్ను చెల్లింపుదారులు తమ పత్రాలను ఆధార్‌తో లింక్ చేయడంలో విఫలమైతే, పాన్ కార్డులు పనిచేయవు. బయోమెట్రిక్ డాక్యుమెంట్‌తో పాన్‌ని లింక్ చేయడంలో విఫలమైతే టీడీఎస్‌, టీసీఎస్‌ తగ్గింపు/వసూళ్ల అధిక రేట్లు ఉంటాయి. రూ. 1,000 ఆలస్య జరిమానా చెల్లించడం ద్వారా పాన్‌ను మళ్లీ యాక్టివేట్ చేయవచ్చు.

You cannot copy content of this page

Scroll to Top