
Trinethram News : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు కుమారుడు మార్క్ శంకర్తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. ఇటీవల సింగపూర్లోని శంకర్ చదివే స్కూల్లో అగ్నిప్రమాదం జరిగి అతనికి గాయాలు కాగా, ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించిన విషయం తెలిసిందే. ఘటన అనంతరం సింగపూర్ చేరుకున్న పవన్ దంపతులు కోలుకొని డిశ్చార్జ్ అయిన మార్క్ శంకర్ను తీసుకొని కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ చేరుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
