కుల గణన చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న

TRINETHRAM NEWS

కుల గణన చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్ బీసీ కుల గణన గురించి గాంధీభవన్లో ముఖ్యమంత్రి మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కుల గణన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కులగణన -2024 సర్వేపై అందరూ అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సూచించారు. గాంధీ భవనంలో బుధవారం కుల గణన పై సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గ్రామాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కులాలకు చెందిన వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే చేపట్టనున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వేను ప్రారంభించనున్నారని అన్నారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి సర్వే జరుగుతున్న అంశాలపై ముందుగా ప్రజలకు తెలియజేయాలన్నారు
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మంత్రులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top