WhatsApp Image 2024 03 09 at 11.23.02 PM
Trinethram News : గాజాలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. షాతి శరణార్ధి శిబిరానికి సమీపంలో ప్రజలకు ఆహారం అందించేందుకు అమెరికా పంపించిన పారాచూట్లు ప్రమాదానికి గురయ్యాయి.
ఎయిర్డ్రాప్ తెరవడంలో సమస్య ఏర్పడి, పారాచూట్లు ఒక్కసారిగా కూలిపోయాయి. ఆహారం ప్యాకెట్లు ఆకాశం నుంచి పడడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. దీనిని గాజా ప్రభుత్వ మీడియా ధృవీకరించింది.
అమెరికా సాయాన్ని ‘మానవతా సేవ కంటే మెరిసే ప్రచారం’ పేర్కొంది.
