WhatsApp Image 2024 01 22 at 6.58.17 AM
అయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు కేవలం 84 సెకండ్ల ముహూర్తం
రేపు జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జీవిత పవిత్రత కేవలం 84 సెకండ్ల పాటు ఉండే అభిజిత్ లగ్న శుభ సమయంలో పూర్తవుతుంది. ఈ ముహూర్తం చాలా శుభప్రదం. ఈ ముహూర్తాన్ని కాశీలోని పండితులు, అర్చకులు కలిసి గణేశ్వర్ శాస్త్రీ ద్రవిడ్ నిర్ణయించారు.
అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్టాపనకు సంబంధించిన శుభ సమయం 2024 జనవరి 22న మధ్యాహ్నం 12 గంటల 29 నిముషాల 8 సెకండ్లకు ప్రారంభం అవుతుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 30 నిముషాల 32 సెకన్ల వరకు కొనసాగుతుంది. ఈ మధ్య ఉన్న వ్యవధి 1 నిమిషం 24 సెకన్లు. ఈ వ్యవధిలోనే అభిజిత్ ముహూర్తం వుంటుంది. ఈ ముహూర్తం రాజ్యాల స్థాపనకు పవిత్రమైనదిగా, దేశం, ప్రజలు దీని నుంచి అనేక విధాలుగా ప్రయోజనం పొంది సుఖ, శాంతి, సంతోషాలతో వుంటారని చెబుతున్నారు.
