జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం

TRINETHRAM NEWS

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం

Trinethram News : పెద్దపల్లి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి అధ్యక్షతన స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందరంలో జిల్లాలోని స్కానింగ్ సెంటర్ లు నిర్వహిస్తున్న గైనకాలజిస్ట్ మరియు రెడియాలజిస్టేలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డా. అన్నా ప్రసన్న కుమారి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి మట్లాడుతూ ఖచ్చితంగా ప్చ్ &పండట్ రిజిష్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి, ధరల పట్టిక, వైద్యుల పేర్లు మరియు సేవల వివరాలు ప్రజలకు అగుపడే విదంగా ప్రదర్శించాలి. రిసెప్షనిస్ట్ మర్యాద పూర్వంగా వ్యవహరించాలి. ధరల మరియు సేవల గురించి వివరంగా స్కానింగ్ కొరకు వచ్చె వారికి చెప్పాలి. రికార్డులు మెయింటెన్ చేయాలి. సంబంధిత రిపోర్ట్స్ ను నెల నెల సరియైన తేది లోపు ఈ కార్యాలయంలో ఇవ్వాలి. లింగ నిర్ధారణ పరీక్షలు చేయుట చట్ట రీత్యా నేరం. ఇచ్చట పుట్ట బోయే బిడ్డ అడ, మగ అని చెప్పబడదు అని బోర్డులు వీలు అయినన్నిస్కానింగ్ కేద్రాలలో ప్రదర్శించాలి అని అన్నారు.

ఏదైనా స్కానింగ్ సెంటర్ లలో లింగ నిర్దారణ చేయడం ప్చ్ &పండట్ Act-1994 ప్రకారం నేరం, వారికి మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ.10,000/-ల జరిమానా విదించడం జరుగుతుందని అని అన్నారు.

ఈ సమావేశంలో డా. వి. వాణిశ్రీ, ప్రోగ్రామ్ ఆఫీసర్ (యం.హెచ్.ఎన్), శ్రీ వెంకటేశ్వర్లు, డిప్యూటి డెమా మరియు జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల (18) గైనకాలజిస్ట్ లు, (3) రెడియాలజిస్ట్ లు పాల్గోన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top