New Judges : తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కొత్త న్యాయమూర్తులు

TRINETHRAM NEWS

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులు

సుప్రీంకోర్టు కొలీజయం నుంచి కీలక సిఫారసులు

ఏపీ హైకోర్టుకు తుహిన్ కుమార్ పేరు ప్రతిపాదన

తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జీల పేర్లు ఖరారు

జూన్ 2న సమావేశంలో కొలీజయం నిర్ణయం
Trinethram News : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులలో కొత్త న్యాయమూర్తుల నియామకానికి మార్గం సుగమమైంది. ఇరు రాష్ట్రాల హైకోర్టులకు కలిపి మొత్తం ఐదుగురు కొత్త జడ్జీల పేర్లను సుప్రీంకోర్టు కొలీజయం సిఫారసు చేసింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజయం కీలక నిర్ణయం తీసుకుంది.

వివరాల్లోకి వెళితే, తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తుల పేర్లను కొలీజయం ప్రతిపాదించింది. వీరిలో సుద్దాల చలపతిరావు, గాడి ప్రవీణ్ కుమార్, వాకిటి రామకృష్ణారెడ్డి, గౌస్ మీరా మొహిద్దీన్ ఉన్నారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ పేరును సిఫారసు చేయడం జరిగింది.

జూన్ 2వ తేదీన జరిగిన సమావేశంలో సుప్రీంకోర్టు కొలీజయం ఈ ఐదుగురి పేర్లను ఖరారు చేసి, వారి నియామకం కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసుల

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

New judges for Telangana

You cannot copy content of this page

Scroll to Top