Trinethram News : వనజీవి రామయ్య మరణం పట్ల స్థానిక తేజా టాలెంట్ స్కూల్ విద్యార్థులు, యాజమాన్యం సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పించారు.కోటి మొక్కలు నాటి గిన్నిస్ బుక్ రికార్డు లోకి ఎక్కి 2017 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేత పద్మశ్రీ అవార్డుతో సత్కరించ బడ్డాడు. వనజీవి రామయ్య పేదరికంలో పుట్టినప్పటికీ, పర్యావరణం పట్ల అమితమైన ప్రేమతో తన కుటుంబం కన్నా ప్రకృతిని రక్షించడంతో పల్లెలు, పట్టణాలు తిరుగుతూ చెట్లను పెంచమని ప్రచారం చేశాడు. అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని తేజ విద్యార్థులు వినమ్రతతో అంజలి ఘటిస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


