దేవరకొండ జులై 11 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా నేరేడు గుమ్ము ఎస్సై సతీష్ వ్యవహారంలో అబద్ధపు కేసులు, ఆపదదాపదమైన ప్రవర్తనలపై గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేతావత్ బాబురామ్ నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్కు 20 రోజుల క్రితం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఆ ఫిర్యాదును ప్రాధాన్యతగా పరిగణించిన జాతీయ ఎస్టీ కమిషన్, నల్గొండ జిల్లా ఎస్పీ మరియు ఎస్సై సతీష్కు నోటీసులు జారీ చేసి, 2025 జూలై 11వ తేదీన జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కానీ విచారణ తేదీన నల్గొండ జిల్లా నుండి ఎలాంటి పోలీస్ అధికారి హాజరుకాలేదు.
ఇది అధికారిక విధి వ్యతిరేకంగా వ్యవహరించినట్టుగా భావించిన జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్గా స్పందించి, నల్గొండ జిల్లా ఎస్పీ, ఎస్సైలను క్షమించలేనిది అని స్పష్టం చేసింది. విచారణకు అధికారులు హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన కమిషన్, ఈ వ్యవహారాన్ని రాష్ట్ర స్థాయి ఐజీ స్థాయికి అందజేసినట్లు ఆయన అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


