
Modi : త్రినేత్రం న్యూస్ : ఇండోనేషియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, బుధవారం నాడు వెయ్యి ఏళ్ల నాటి చారిత్రక ప్రంబనన్ హిందూ దేవాలయాల సముదాయానికి సంబంధించిన అద్భుతమైన వైమానిక దృశ్యాలను ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కలిసి హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాన్ని చూసి ప్రశంసించారు. జావా ద్వీపంలో ఉన్న ప్రంబనన్ ఆలయం ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయం, ఆగ్నేయాసియాలో రెండో స్థానంలో ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe