దేవరకొండ ఆగష్టు 19త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “మండల ఎఫ్ ఎల్ ఎం- టి ఎల్ ఎం మేళా” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధన అభాస్యన సామగ్రి ఉపయోగించడం ద్వారా విద్యార్థులకు అర్థవంతంగా బోధన అందుతుంది అని అన్నారు. ఉపాధ్యాయులు మేళాను నిర్వహించడం గొప్ప విషయం అని,అనంతరంఉపాధ్యాయుల ,ప్రదర్శనలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ని ఉపాధ్యాయుల బృందం వారు శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు,మండల ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఉపాద్యాయులు , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


