MLA Jare : నూతన అయ్యప్ప స్వామి పీఠం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో, గ్రామస్తులచే లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్మించబడిన హరిహరాత్మజ అయ్యప్ప స్వామి పీఠం ప్రారంభోత్సవ మహోత్సవంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ ప్రజలు భక్తి భావంతో నిర్మించిన అయ్యప్ప స్వామి పీఠం ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ పీఠం ద్వారా చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు, అయ్యప్ప స్వామి భక్తులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Jare Adinarayana participated in the inauguration

You cannot copy content of this page

Scroll to Top