టీడీపీ చీఫ్ చంద్రబాబు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
‘ఎన్టీఆర్ పదవిని, ఎన్టీఆర్ ట్రస్టును బాబు లాక్కున్నారు.
టీడీపీ నేతలు తెలివి తక్కువ దద్దమ్మలు. నాకు చంద్రబాబులాగా కుర్చీ లాక్కునే లక్షణం లేదు.
సీఎం జగన్ కుర్చీలో నేను కూర్చోలేదు.
సీఎం సమీక్షలు నిర్వహించే గదిలో కూర్చున్నా.
జగన్ తలచుకుంటే ఎవ్వరినైనా ఎక్కడైనా కూర్చోబెడతారు’ అని పేర్కొన్నారు.


