WhatsApp Image 2024 12 16 at 21.20.01
జిల్లాలో హత్యా రాజకీయాలకు తావు లేదు: మంత్రి అచ్చెన్నాయుడు
Trinethram News : పలాస
శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ నేత హత్య కుట్రపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. వైసీపీ నేతలు ఐదేళ్లపాటు హత్యా రాజకీయాలు ప్రోత్సహించారని, అధికారం కోల్పోయిననా అదే పద్ధతి కొనసాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ హత్య కుట్ర వెనక ఎంతటి వారున్నా వారి పై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో హత్యా రాజకీయాలకు ఎప్పటికీ తావు లేదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హెచ్చరిక జారీ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
