జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 11 at 5.23.38 PM

TRINETHRAM NEWS

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై టోల్గేట్ సమీపంలో రోడ్డుపై పనిచేస్తున్న హైవే సిబ్బందిపై పాల మినీ ట్యాంకర్ దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది. రోజువారీగా కూలి పనిచేస్తూ, రోడ్డుపై హెచ్చరిక బోర్డులు పెట్టి కూలీలు పనిచేస్తుండగా పాలమినీ ట్యాంకర్ డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి కర్నూల్ వైపు వెళ్తుండగా జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను వెనువెంటనే కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

You cannot copy content of this page