TRINETHRAM NEWS

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం డివిజన్లోని మెట్కాన్గూడ లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరిగిన జాతర మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీశైలం గౌడ్ ని ఘనంగా సత్కరించారు. స్వామివారి ఆశీస్సులతో కుత్బుల్లాపూర్ నియోజక వర్గ ప్రజలంతా సుభిక్షంగా సుఖసంతోషాలతో ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు.