ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ

TRINETHRAM NEWS

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది.

సుమారు రూ. 30 లక్షల నగదు, రూ. కోటిన్నర విలువ చేసే బంగారం అపహరణకు గురైంది.

బ్యాంక్ వెనుక భాగంలో కిటికీ డ్రిల్స్ ను గ్యాస్ కట్టర్ తో తొలగించి.. దుండగులు బ్యాంకులోకి చొరబడినట్లు గుర్తించారు.

విషయం తెలుసుకున్న ఎస్పీ సతీష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

You cannot copy content of this page

Scroll to Top