Trinethram News : బాపట్ల మండలం, ఆసోదివారిపాలెం పంచాయతీ, పోతురాజుకొత్తపాలెం నుండి 32మంది వైసిపి కార్యకర్తలు బాపట్ల మండల మాజీ అధ్యక్షులు కావూరి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యం లో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని పార్టీ లోకి చేరారు.ఈ కార్యక్రమం లో బాపట్ల మండల అధ్యక్షులు ముక్కముల సాంబశివరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


