వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. గ్రామ పంచాయతీలకు మహర్దశ.. 15వ ఆర్థిక సంఘం నిధులకు లైన్ క్లియర్
తెలంగాణ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్నికైన సర్పంచ్లకు శుభవార్త అందించింది. గ్రామ పంచాయతీలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు, సుమారు రూ.2500 కోట్లు విడుదల చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
ఈ నెలాఖరులోగా కనీసం రూ.వెయ్యి కోట్లు, మిగిలిన నిధులను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు సమాచారం. నిధుల వినియోగంలో డిజిటల్ ప్రక్రియ తప్పనిసరి చేస్తూ, ప్రతి గ్రామపంచాయతీ ప్రత్యేక బ్యాంకు ఖాతాను పీఎఫ్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేయాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


