Midday Meal : సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం

TRINETHRAM NEWS

తేదీ : 20/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వచ్చే విద్యా సంవత్సరం నుంచి సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజనం అందించినట్లు పౌర శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ అనడం జరిగింది. సంక్షేమ వసతి గృహాలకు కూడా సన్నబియ్యమే పంపిణీ చేస్తామన్నారు. ఇటీవల క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

పాఠశాలలతో పాటు ఇంటర్మీడియట్ కాలేజీలకు భోజనాన్ని అందిస్తున్నట్లు విషయం తెలిసిందే. త్వరలో ఆయా ప్రాంతాల అభిరుచులకు అనుగుణంగా మెనూ ప్రకటిస్తారని తెలపడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top