
Leander Paes Joins BJP : త్రినేత్రం న్యూస్ : Mar 31, 2026, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, సుకాంత మజుందార్ సమక్షంలో బీజేపీలో చేరారు.
ప్రధాని మోడీ, అమిత్ షా, నితిన్ నబిన్లకు కృతజ్ఞతలు తెలిపిన పేస్, క్రీడలు, యువత అభివృద్ధిపై దృష్టి సారిస్తానని, బెంగాల్తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. పేస్ చేరిక బెంగాల్ బీజేపీకి పెద్ద బూస్ట్ అని సుకాంత మజుందార్, క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలే పేస్ను ఆకర్షించాయని కిరణ్ రిజిజు పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

