WhatsApp Image 2024 06 29 at 16.24.51
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం మున్సిపల్ పరిధిలో స్థానిక 45వ డివిజన్ లో ద్వారకా నగర్ ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తడంతో ప్రజలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే డివిజన్ ప్రజలకు మంచినీటి కష్టాలు తీర్చడం కోసం రామగుండం మున్సిపల్ అధికారులకు టాంకర్ల ద్వారా మంచి నీటి సరఫరా చేయాలని విజ్ఞప్తి మేరకు మంచినీటి ట్యాంకర్లల ద్వారా ప్రజలకు మంచి నీటి అందించడం జరిగింది
ఈ సందర్భంగా కార్పొరేటర్ కొమ్ము వేణు మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం డివిజన్ ప్రజలకు మంచినీరు అందించడం కోసం మున్సిపల్ సిబ్బందితో టాంకర్ల ద్వారా త్రాగునీరు అందించడం జరిగింది. డివిజన్ ప్రజల సమస్యలపై నిరంతరం సహాయ సహకారాలు అందిస్తామని
ఈ సందర్భంగా తెలియజేశారు
ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మున్సిపల్ అధికారులకు మరియు సిబ్బందికి మా డివిజన్ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొమ్ము వేణు వెంట కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ మీసాల సతీష్ , మైనార్టీ జనరల్ సెక్రెటరీ గులాం ముస్తఫా యువకులు డివిజన్ మహిళలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
