జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 18 at 4.18.48 PM

TRINETHRAM NEWS

రేపటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన జూనియర్ డాక్టర్లు..

హైదరాబాద్ : తెలంగాణలో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా.. రేపట్నుంచి విధులకు హాజరు కాబోమని జూడాలు ప్రకటించారు. గత మూడు నెలలుగా స్టైపెండ్ ఇవ్వకపోవడంతో రేపటి నుంచి జూడాలు సమ్మెకు పిలుపునిచ్చారు..

రేపటి నుండి సమ్మె చేస్తామని ప్రభుత్వానికి వారు నోటీస్ ఇచ్చారు. ఈ క్రమంలో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది .రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యార్థులు 10 వేల మంది వరకు ఉంటారు. అందులో.. గవర్నమెంట్ హాస్పిటల్ లో ఇంటర్న్షిప్ చేస్తున్న హౌస్ సర్జన్లు 2500 మంది ఉంటారు. పీజీ స్పెషాలిటీ విద్యార్థులు(జూడా) 4000 మంది ఉంటారు. సీనియర్ రెసిడెంట్లు 1500 ఉంటారు..

You cannot copy content of this page