కూకట్పల్లి, ఆగస్టు 21: (త్రినేత్రం న్యూస్) ఈరోజు కేపీహెచ్బీ కాలనీ 2వ రోడ్ లో గల ప్రభుత్వ మండల అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మెగా సిటీ వారి ఆధ్వర్యంలో జరిగిన చేయూత ప్రేమ్ కుమార్ సహకారం తో కార్యక్రమమునకు విశిష్ట అతిథిగా జనసేన పార్టీ కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాల్గొని ఆధునిక వాటర్ ప్యూరిఫైర్ ను వారి చేతుల మీదగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కి అందజేశారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆరోగ్యకరంగా ఉండాలని మంచి ఉద్దేశముతో లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మెగా సిటీ డిస్టిక్ – 320ఎ గవర్నర్ డి.కోటేశ్వరరావు , వి.సత్యనారాయణ రావు , ఎం.అనిల్ కుమార్ ,మరియు సభ్యులు చేసిన సేవా దృక్పదమునకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కలిగినిడి ప్రసాద్ , సుంకర సాయి , అంజి,విస్సు, పాపారాయుడు ,బాబురావు, రాము ,నాగేశ్వరరావు, హరి,సురేష్ , పులగం సుబ్బు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


