Gundla Raghuvanshi : జల జీవన్ దినోత్సవం సందర్బంగా చెరువు పనులు ప్రారంభించిన, జనసేన సీనియర్ నాయకులు

TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( జి. కె. వీధి మండలం ) వంచుల పంచాయితీ, ఈతలబంద గ్రామం లో ఉపాధి హామీ పథకంద్వారా, పారంపండు (చెరువు ) జలజీవన్ దినోత్సవం సందర్బంగా కొబ్బరకాయ కొట్టి ప్రారంభించిన, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుండ్ల రఘువంశి మరియు వంచుల సర్పంచ్ వనపల కాసులమ్మ, ఎంపీపీ బోయిని కుమారి, గ్రామస్తులు అలాగే కూటమి నాయకులు.జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుండ్ల రఘువంశీ మాట్లాడుతూ ముందుగా అందరికి జలజీవన్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు.

కూటమి ప్రభుత్వం వచ్చి పాత చెరువు లలో పూడికలు తీయటం అలాగునే ఉపాధి హామీ పథకం ద్వారా కొత్త చెరువులు మంజూరు చేయటం ద్వారా రైతులకు పెద్ద పీట వేసింది అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమం లో అరడా కోటేశ్వరరావు, పోతురు కొడబాబు,మండల ప్రధాన కార్యదర్శి యూత్ అధ్యక్షులు ముర్ల కోటేశ్వరరావు,భూత్ ఇంచార్జ్ ముర్ల భూపతి, వైసీపీ నాయకులు వనపల రాజేష్, పోతురు గంగరాజు, ఉపాధి హామీ సిబంది APO చల్లంగి రాంప్రసాద్, TA శివ, VRP బూడిద వెంకట్రావు, మర్రి కాంతారావు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Janasena senior leaders inaugurated

You cannot copy content of this page

Scroll to Top