Jagan’s Victory with a Majority : భారీగా తగ్గిన జగన్ మెజార్టీ – 60 వేల ఓట్ల మెజార్టీతో జగన్ గెలుపు

TRINETHRAM NEWS

Jagan’s majority reduced by a huge margin – Jagan’s victory with a majority of 60 thousand votes

AP Election Result 2024: పులివెందులలో జగన్ 60 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో దాదాపుగా 90వేలకుపైగా మెజార్టీతో విజయం సాధించిన ఆయన ఈ సారి 40వేల వరకూ ఓట్లను కోల్పోయారు.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజవర్గం నుంచి విజయం సాధించారు. జగన్మోహన్ రెడ్డికి 61,169 ఓట్ల మెజార్టీ వచ్చింది. గత ఎన్నికల్లో ఆయన 90 వేలకుపైగా మెజార్టీ సాధించారు. కానీ ఈ సారి ఆయన మెజార్టీ 30వేలకు తగ్గిపోయింది.

కుటుంబంలో చీలిక రావడం.. వైఎస్ షర్మిల కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండటంతో పెద్ద ఎత్తున ఓట్లు చీలిపోయినట్లుగా తెలుస్తోంది.

గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సతీష్ కుమార్ రెడ్డికి 32 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ సారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీటెక్ రవికి యాభై వేలకుపైగా ఓట్ల వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ధృృవకుమార్ రెడ్డికి పది వేల ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన దస్తగిరికి ఐదు వందల ఓట్లు వచ్చాయి.

గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సతీష్ కుమార్ రెడ్డికి 32 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ సారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీటెక్ రవికి యాభై వేలకుపైగా ఓట్ల వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ధృృవకుమార్ రెడ్డికి పది వేల ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన దస్తగిరికి ఐదు వందల ఓట్లు వచ్చాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jagan's majority reduced by a huge margin - Jagan's victory with a majority of 60 thousand votes

You cannot copy content of this page

Scroll to Top