Indira Mahila Shakti Program : ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం పలు వ్యాపారాలను చెకింగ్ చేసిన ఉన్నతాధికారులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ములకలపల్లి పంచాయితీ లోని రాజుపేట కాలనీలోని చింతకాయల కుమారి, వెంకటేశ్వరరావు (కౌజుపిట్టల) యూనిట్ ను ప్రారంభించుకున్నారు. ఈ యొక్క యూనిట్ ను సెంట్రల్ నుండి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ ,జిల్లా కలెక్టర్, ఐటిడిఏ పిఓ,అడిషనల్ కలెక్టర్ విద్యచందన విజిట్ చేసి. ఈ యూనిట్ను ఏర్పాటు చేసుకోవటం వలన, నెలకు ఎంత సంపాదిస్తారు. లోన్ ఎక్కడ నుండి తీసుకున్నారు. ఎంత EMI కడుతున్నారు. అని అడిగి తెలుసుకోవడం జరిగింది.

తదనంతరం చౌటిగూడెం గ్రామంలోకి తానం లత, రాజశేఖర్ ఏర్పాటు చేసుకున్న (పుట్టగొడుగుల) యూనిట్ ను సందర్శించి, ఈ యూనిట్ ఏర్పాటుకు శిక్షణ, విత్తన సేకరణ, ఎలా పెంచడం మరియు మార్కెటింగ్ ఎక్కడ నుండి వస్తుంధని ప్రశ్నించారు. శిక్షణ మహిళా సంఘాల ద్వారా ఖమ్మంలో తీసుకున్నాము. లోన్ సదుపాయం అంకిత మండల మహిళా సమాఖ నుండి రూ 3,00,000/- లోన్ తీసుకున్నాము అని టి.లత తెలియచేసినారు. అనంతరం మొగురాలగుప్ప, మూకమామిడి గ్రామములోని వెదురు నాటుకున్న రైతులను, సెంట్రల్ నుండి వచ్చిన అధికారులు మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో, సెంట్రల్ నుండి అధికారులు, జిల్లా కలెక్టల్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Indira Mahila Shakti Program

You cannot copy content of this page

Scroll to Top