Dr. Satthi : మొంథా తుపాను నేపధ్యంలో తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

TRINETHRAM NEWS

మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, విజ్ఞప్తి

Trinethram News : మెడికల్‌ కాలేజ్‌లు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ అక్టోబర్‌ 28వ తేదిన (మంగళవారం) అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో వైయస్‌ఆర్‌సీపీ తలపెట్టిన ర్యాలీ నవంబర్‌ 4 వ తేదీకి వాయిదా.. మొంథా తుపాను నేపధ్యంలో తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, సూచించారు.

అలాగే వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పిలుపునిచ్చారు.

ఈ నేపధ్యంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌లు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ అక్టోబర్‌ 28వ తేదిన (మంగళవారం) అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో వైయస్‌ఆర్‌సీపీ తలపెట్టిన ర్యాలీలను, మొంథా తుపాను కారణంగా, నవంబర్‌ 4 వ తేదీకి వాయిదా వేయడమైనదని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

people in the cyclone-affected areas should be on high alert

You cannot copy content of this page

Scroll to Top