ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 02 01 at 2.21.27 PM

TRINETHRAM NEWS

Trinethram News : Delhi

వచ్చే 5 ఏళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం కానుందని.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టారు. అయితే, ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆదాయపన్ను వర్గాలకు ఈ బడ్జెట్ లో ఊరట లభించలేదు.

పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులేదని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

రూ.7లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్నులేదని నిర్మలా సీతారామన్ తెలిపారు.

గతంలో ఎలాంటి పన్నుల స్లాబులు ఉన్నాయో.. వాటినే అమలు చేయనున్నారు. ప్రత్యేక్ష, పరోక్ష పన్నుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

కొత్త ఆదాయపు పన్ను స్లాబ్ లు.. ఇలా..

రూ.3-6 లక్షల మధ్య ఆదాయంపై 5 శాతం పన్ను విధించబడుతుంది (సెక్షన్ 87A కింద పన్ను రాయితీ అందుబాటులో ఉంది)
రూ. 6-9 లక్షల మధ్య ఆదాయంపై 10 శాతం పన్ను విధించబడుతుంది ( రూ. 7 లక్షల వరకు ఆదాయంపై సెక్షన్ 87A కింద పన్ను రాయితీ అందుబాటులో ఉంది)
రూ. 9-12 లక్షల మధ్య ఆదాయానికి 15 శాతం
రూ. 12-15 లక్షల మధ్య ఆదాయానికి 20 శాతం
రూ.15 లక్షలు.. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30 శాతం పన్ను విధించనున్నారు.
కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు అన్ని వర్గాల వ్యక్తులకు, సీనియర్ సిటిజన్‌లు, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు ఒకే విధంగా ఉంటాయి.
పాత పన్ను స్లాబ్‌లు
పాత పన్ను విధానంలో రూ. 2.5 వరకు ఆదాయం పన్ను నుండి మినహాయించబడింది.
రూ. 2.5 నుండి రూ. 5 లక్షల మధ్య ఆదాయం పాత పన్ను విధానంలో 5 శాతం చొప్పున పన్ను విధించబడుతుంది.
వ్యక్తిగత ఆదాయం రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు పాత పాలనలో 20 శాతం చొప్పున పన్ను విధించబడుతుంది.
పాత విధానంలో రూ. 10 లక్షలకు పైబడిన వ్యక్తిగత ఆదాయంపై 30 శాతం పన్ను విధించబడుతుంది.
పాత పన్ను విధానంలో, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్‌లకు రూ. 3 లక్షల వరకు ఉంటుంది. కానీ 80 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి, 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్‌లకు ₹ 5 లక్షల వరకు ఉంటుంది.

You cannot copy content of this page