WhatsApp Image 2025 01 06 at 19.58.44
అక్రమంగా వెళ్తున్న అధిక లోడు ఇసుక లారీలు పట్టివేత
త్రినేత్రం న్యూస్. ముత్తారం ఆర్ సి :
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు ముత్తాల మండల తాసిల్దార్ సుమన్ ఖమ్మంపల్లి సమీపంలోని తాడిచర్ల బ్లాక్ వన్,తాడిచర్ల బ్లాక్ టు ఇసుక క్వారీలను పరిశీలించగా ఆరు లారీలు అధిక లోడుతో పోతున్నట్లు గుర్తించి లోడ్ తో ఉన్న లారీలను ఎగ్లాస్పూర్ తూకం కంట వద్ద తిరిగి తూకం వేయగా ఒక్కొక్క లారీ సుమారు మూడు నుంచి ఏడు టన్నుల వరకు అధికలోడుతో ఉన్నట్లు గుర్తించారు.ప్రభుత్వ నిబందనలు ఉల్లంఘీంచినందున అట్టి లారీలను భద్రత కొరకు ముత్తారం పోలీస్ స్టేషన్ కు తరలించామన్నారు.ఈ కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ ఏండీ షఫీ, గీర్దావర్ శ్రీధర్ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
