ఎస్బీఐ యోనో యాప్ బ్లాక్ అవుతుందంటూ నకిలీ ప్రచారం
ఆధార్ అప్డేట్ కోసం ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేయాలంటూ మెసేజ్లు
ఇది పూర్తిగా మోసమని తేల్చిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
వ్యక్తిగత,బ్యాంకింగ్ వివరాలు పంచుకోవద్దని సూచన
Trinethram News : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) యోనో యాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఓ నకిలీ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆధార్ వివరాలు అప్డేట్ చేయకపోతే మీ యోనో యాప్ బ్లాక్ అవుతుందని ఈ మెసేజ్లో హెచ్చరిస్తున్నారు.అయితే,ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని,ఇదొక మోసపూరిత సందేశమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది.
ఆధార్ను అప్డేట్ చేసుకోవడానికి ఓ ఏపీకే (ఏపీకే) ఫైల్ను డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేసుకోవాలని సైబర్ నేరగాళ్లు ఈ సందేశంలో కోరుతున్నారు.దీని ద్వారా వినియోగదారుల వ్యక్తిగత,బ్యాంకింగ్ వివరాలు,పాస్వర్డ్లు,ఓటీపీలు తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


