హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్లో 208 మంది పాక్ పౌరుల నమోదు
వీరిలో 156 మందికి దీర్ఘకాలిక వీసాలు
గడువులోగా దేశం విడిచి వెళ్లాలని పాకిస్థానీలకు ఆదేశాలు
Trinethram News : పహల్గామ్ ఉగ్రదాడి ఉదంతం తర్వాత దేశంలో నివసిస్తున్న పాకిస్థానీ పౌరుల వీసాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నిర్దేశిత గడువులోగా పాకిస్థానీయులందరూ దేశం విడిచి వెళ్లాలని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో, నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా, హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్ లో నమోదైన పాకిస్థానీ పౌరుల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
సాధారణంగా విదేశీయులు శంషాబాద్లోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ)లో నమోదు చేసుకోవాల్సి ఉండగా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జాతీయులు మాత్రం నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని పాతబస్తీ పురానీ హవేలీలో ఉన్న ప్రత్యేక విభాగంలో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ విభాగం వద్ద లభించిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం నగరంలో మొత్తం 208 మంది పాకిస్థానీ పౌరులు అధికారికంగా నమోదై
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


