త్రినేత్రం న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం, అందుబాటులోకి పచ్చిరొట్ట విత్తనాలు. వానాకాలం సీజన్ కి ప్రభుత్వం పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జీలుగు 3,252 క్వింటాళ్లు, జనుము 1,170 క్వింటాళ్లు కలిపి 4,422 క్వింటాళ్ల విత్తనాలను అధికారులు తెప్పించారు. ఖమ్మంలో 75 pacsలు,13 ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, రెండు TGSDL, ఒక ట్రేడర్, అటు భద్రాద్రిలో 20 PACSలు, ఏడు ఆగ్రో రైతు సేవ కేంద్రాలు, ఒక ట్రేడర్ ద్వారా విత్తనాలను విక్రయానికి ఏర్పాట్లు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


