సాయి సుదీక్షిత కు 30 నెలల నుండి రెండు వేల రూపాయల చెక్ ను అందజేస్తున్నా

TRINETHRAM NEWS

Giving a check of two thousand rupees to Sai Sudikshita from 30 months

సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్ గాంధీనగర్ కు చెందిన గద్దల అనిల్ కుమార్ కుమార్తె సాయి సుదీక్షిత మెడిసిన్ విద్యార్థినికి.గత 30 నెలలుగా ప్రతి నెల మొదటి వారంలో సేవా స్పూర్తి ఫౌండేషన్ తరుపున విద్యార్ధినికి రెండు వేల రూపాయలు అందజేస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగా బుధవారం రోజున గాంధినగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెండు వేల రూపాయల చెక్ ను సాయి సుదీక్ష తండ్రి గద్దల అనిల్ కుమార్ కు అందజేయడం జరిగిందని సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మల్లేష్ తెలిపారు అనంతరం మల్లేష్ మాట్లాడుతూ సేవా స్ఫూర్తి ఫౌండేషన్ స్థాపించిన నాటి నుండి నేటి వరకు రామగుండం నియోజకవర్గంలో ఎంతో మంది నిరుపేదలను ఆదుకోవడం జరిగిందని నేను చేస్తున్న నా ప్రతి సేవా కార్యక్రమానికి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఫౌండేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు గత 30 నెలల నుండి సాయి సుదీక్ష కు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులందరి సహకారంతో ప్రతినెల రెండు వేల రూపాయలు అందజేస్తామని ప్రతి నెల ఫౌండేషన్ కు సహాయ సహకారం అందిస్తున్నా సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులందరికీ పేరుపేరునా సాయి సుదీక్ష తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ అన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Giving a check of two thousand rupees to Sai Sudikshita from 30 months

You cannot copy content of this page

Scroll to Top